ఇండియా-ఐర్లాండ్ మధ్య రెండో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్

-

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. తొలి మ్యాచ్ జరిగిన డబ్లిన్ లోనే నేటి మ్యాచ్ కూడా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియాకు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ సిరీస్ లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా టాస్ సందర్భంగా మాట్లాడుతూ, జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు. మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ బరిలో దింపుతున్నామని వెల్లడించాడు. అటు, ఐరిష్ టీమ్ కూడా మార్పుల్లేకుండా బరిలో దిగుతున్నట్టు ఆ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పేర్కొన్నాడు.

అయితే.. వర్షం ఆటంకం కలిగించిన తొలి టీ20లో భారత జట్టు.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే వేదికలో నేడు రెండో టీ20 జరుగుతుండగా.. ఈ మ్యాచ్‍కు వర్షం ముప్పు లేనట్టు కనిపిస్తోంది. పిచ్ కూడా బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి మరో పోరు మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని జస్‍ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా పట్టుదలగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version