చంద్రబాబు హై కోర్ట్ షరతులను ఉల్లంఘించారా ?

-

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేహ్ట చంద్రబాబు నాయుడు 52 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు బయటకు వస్తారా అంటూ కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చిన కొన్ని గంటల్లోనే హై కోర్ట్ షరతులను ఉల్లంఘించారు అంటే అవుననే తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హై కోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ తో పాటు కొన్ని షరతులను కూడా విధించింది, వాటిలో భాగంగా ర్యాలీలతో పాల్గొనడం మరియు మీడియా తో మాట్లాడకూడదు అంటూ చెప్పడం తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఘటన చూశాము.

అందుకే ఈ విషయంలో ఏపీ సిఐడి హై కోర్ట్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక చంద్రబాబు తన మద్దతుదారులను ఉద్దేశించి చాలా సేపు మీడియాతో మాట్లాడడం విశేషం. ఇప్పటి వరకు నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదములు అంటూ చంద్రబాబు ఎంతో సంతోషంగా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version