భూమిమీద అత్యంత పవిత్రమైన నగరం ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు ‘కాశీ’. శివుని త్రిశూలం మీద ఈ నగరం నిలిచి ఉంటుందని, ప్రళయ కాలంలో కూడా దీనికి వినాశనం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికతకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రం వెనుక ఎన్నో వింతలు, అంతుచిక్కని దైవ రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు కాశీని ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? అక్కడ చనిపోతే మోక్షం ఎందుకు వస్తుంది? ఆ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శివుని నివాసం – త్రిశూలం పై నగరం: కాశీ నగరం గంగా నది తీరాన వెలసిన ఒక అద్భుతం. అయితే పురాణాల ప్రకారం ఈ నగరం భూమికి ఆనుకుని ఉండదు, సాక్షాత్తు పరమేశ్వరుడి త్రిశూలం మీద ఉంటుంది. అందుకే ఇక్కడ అడుగుపెడితేనే ఏదో తెలియని ప్రశాంతత శక్తి కలుగుతాయి. మీకు తెలుసా? కాశీలో విశ్వనాథుడే కాకుండా కాలభైరవుడు ఈ నగరానికి రక్షకుడు గా ఉంటారు. ఆయన అనుమతి లేనిదే కాశీలో ఎవరూ ప్రవేశించలేరని భక్తుల నమ్మకం.

మణికర్ణిక ఘాట్ రహస్యం: కాశీలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ‘మణికర్ణిక ఘాట్’. ఇక పోతే, ఇక్కడ ఉన్న స్మశాన వాటికలో చితి ఎప్పుడూ ఆరిపోదు. సంవత్సరంలో 365 రోజులు 24 గంటలు ఇక్కడ శవ దహనాలు జరుగుతూనే ఉంటాయి. అసలు విషయం ఏమిటంటే ఇక్కడ మరణించిన వారి చెవిలో శివుడే స్వయంగా ‘తారక మంత్రం’ ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. అందుకే జీవిత చరమాంకంలో చాలామంది కాశీకి వెళ్లి అక్కడే ప్రాణాలు విడవాలని కోరుకుంటారు.
గంగా హారతి – అంతుచిక్కని శక్తి: ప్రతిరోజూ సాయంత్రం దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతి ఒక అద్భుత దృశ్యం. ఆ సమయంలో అక్కడ అద్భుతమైన సానుకూల శక్తి (Positive Energy) ప్రవహిస్తుందని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. కాశీలోని ఇరుకైన గల్లీలు ప్రాచీన ఆలయాలు ప్రతి అడుగులోనూ ఒక చరిత్రను దైవ రహస్యాన్ని వినిపిస్తాయి. ఇక్కడి అన్నపూర్ణ దేవి ఆలయం గురించి వినే ఉంటారు ఇక్కడ ఎవరూ ఆకలితో పడుకోరని ప్రతీతి.
కాశీ అంటే కేవలం ఒక నగరం కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. మనిషి తన అహంకారాన్ని వదిలి, పరమాత్మలో లీనమయ్యే చోటు. భౌతిక ప్రపంచం నుంచి విముక్తి పొంది మోక్ష మార్గంలో పయనించాలనుకునే ప్రతి ఒక్కరికీ కాశీ ఒక పవిత్ర గమ్యం. ఆ విశ్వనాథుని కృప ఉంటేనే కాశీ ప్రయాణం సాధ్యమవుతుంది.
