రమ్యకృష్ణ – కృష్ణవంశీల మధ్య గొడవలకు కారణం ఆ హీరోయినేనా..?

-

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ రమ్యకృష్ణ.. డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. రమ్యకృష్ణ నటించిన నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాతో కృష్ణవంశీ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించారు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పాపులారిటీ సంపాదించారు.. కృష్ణవంశీ కెరియర్ లో ఎన్నో ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఇటీవలే వచ్చిన రంగమార్తాండ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

రమ్యకృష్ణ కూడా హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నది .. అయితే అవకాశాలు రాని సమయంలో పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.ఇక బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. గత కొంతకాలంగా రమ్యకృష్ణ తన భర్త కృష్ణ వంశీ మధ్య గొడవలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.. రమ్యకృష్ణ తన కొడుకుని తీసుకొని కృష్ణవంశీకి దూరంగా చెన్నైలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వార్తలపై కొన్ని రోజులుగా వీరు ఇద్దరు స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు

అయితే ఈ వార్తలన్నిటికీ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ లో చెక్ పెట్టడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో హీరోయిన్ ఛార్మి.. ఛార్మి , కృష్ణవంశీ మధ్య గతంలో మంచి రిలేషన్ ఉన్నది.. అయితే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఒక పుకారు వైరల్ కావడంతో.. అది కాస్త రమ్యకృష్ణకు చేరడంతో విభేదాలు వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దవాళ్లు కలుగజేసుకొని మరి వీరిద్దరి మధ్య విభేదాలను పోగొట్టడంతో వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లుగా సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news