BRS ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

-

రాష్ట్రంలో ఆదాయపన్ను సోదాలు మరోసారి కలకలం సృష్టించాయి. మాజీ ఐఏఎస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంటితోపాటు ప్రముఖ నిర్మాణ సంస్థలైన రాజపుష్ప, వర్టెక్స్‌, ముప్పాలతోపాటు ఔషధ సంస్థ వసుధ ఫార్మా సంస్థలో ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపారు. దాదాపు 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

రామచంద్రాపురం సమీపంలోని తెల్లాపూర్‌లో రాజపుష్ప లైఫ్‌స్టైల్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. నిన్న ఉదయం మొదలైన సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి. రాజపుష్ప సంస్థ తెల్లాపూర్‌లో దాదాపు 60 ఎకరాల్లో విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తోంది. ఆయా నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను పరిశీలించి.. కీలకమైన పత్రాలు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version