పవిత్ర – నరేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్..!!

-

పవిత్ర లోకేష్.. వీ.కే.నరేష్.. ప్రస్తుతం వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వీరిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఇక అంతేకాదు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను నరేష్ ఎలా వివాహం చేసుకుంటాడు అంటూ ఆమె కన్నడ మీడియా ముందు గళం విప్పింది. ఇక పవిత్ర లోకేష్ మాత్రం కృష్ణ సపోర్ట్ ఉందని ఎలాగైనా సరే మేము పెళ్లి చేసుకుంటామని, సహజీవనం కూడా చేస్తున్నామని తెలిపింది. ఇక మొత్తానికైతే బాగా ఈ గొడవ ముదిరిపోతున్న నేపథ్యంలో కృష్ణ సైతం కలుగజేసుకొని కుటుంబ మర్యాద పోగొడుతున్నారు అంటూ నరేష్ పై బాగా ఫైర్ అయినట్లు సమాచారం.

ఇకపోతే వీరిద్దరిపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా స్పందించినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ఆది తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్నాడు. ఇకపోతే జబర్దస్త్ నుంచి ఎంతోమంది వెళ్లిపోతున్నా ఆది, రాంప్రసాద్ మాత్రం జబర్దస్త్ నుంచి వెళ్లిపోకుండా జబర్దస్త్ పై తమకు ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకుంటున్నారు. ఇక జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా ఆస్తిపరంగా కూడా అభివృద్ధి చెందినట్లు సమాచారం. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తాత్కాలికంగా జబర్దస్త్ షో కి ఆది గుడ్ బాయ్ చెప్పి, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లలో మాత్రమే కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా పవిత్ర లోకేష్, నరేష్ పై వైరల్ అవుతున్న వార్తలపై స్పందిస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది పరోక్షంగా సెటర్లు వేయడం జరిగింది. ఈ షోలో నరేష్ గురించి చర్చ రావడంతో పవిత్ర ముందుకు వస్తుంది. నరేష్ కు నేను ఉన్నానని పవిత్ర చెప్పగా ఆది నీ పేరేంటి అని అడిగిన వెంటనే పవిత్ర అని ఆమె సమాధానం ఇస్తుంది. ఇక వాడి పేరేంటి అని అడగగా నరేష్ అని పవిత్ర చెబుతారు. ఇక తర్వాత ఆది సెటైర్లు వేస్తూ సైలెంట్ అయిపోయారు. ఆది అలా కామ్ గా ఉండిపోవడంతో ఎవరికి ఏం అర్థం కాక చూస్తూ ఉండగా పంచు ప్రసాద్ వచ్చి పవిత్ర లోకేష్ గురించి హైపర్ ఆది కామెంట్ చేశారని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version