చంద్రబాబు నాయుడు కాదు నీతుల నాయుడు అన్నారు జగదీశ్ రెడ్డి. మహా టీవీ మీద దాడి జరిగిందని ఖండించిన నీతుల నాయుడు, డెక్కన్ క్రానికల్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయాడు అని నిలదీశారు. మా పిల్లల నిరసన పూర్తి కాకముందే నీతుల నాయుడుకు ఎలా తెలిసింది.. ఎలా అంటే మహా న్యూస్ కూడా నీతుల నాయుడుదే అని ఫైర్ అయ్యారు.

చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసిన బీజేపీ వాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు.. అందరి బాగోతాలు తెలుసు అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కోదండరాం సల్లగా సమైక్య వాదుల నీడల బ్రతుకుతున్నాడన్నారు. తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కోదండరాం ఎందుకో స్పందించలేదు అని పేర్కొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
సత్య హరిశ్చంద్రులకు అన్నలుగా మాట్లాడుతున్నరు
ఆంధ్రప్రదేశ్లో ఒక ఛానల్పై పూర్తిగా నిషేధం పెట్టి ఎందుకు రానిస్తలేరు నీతుల నాయుడు @ncbn ?
నీతుల నాయుడు @DeccanChronicle ఆఫీస్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయాడు
రెండు నిమిషాల్లో నీతుల నాయుడుకు సమాచారం… pic.twitter.com/t3JTZsF8rD
— Telugu Feed (@Telugufeedsite) June 30, 2025