అమిత్ షాది..అబద్ధాల షో, మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే – జగదీష్ రెడ్డి

-

అమిత్ షాది..అబద్ధాల షో, మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమేనని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదా మరిచి కింది స్థాయి నాయకుడిగా మాట్లాడిండని… తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడే మాట ఒక్కటైన చెప్పిండా అని నిలదీశారు. BJP బాగోతమంతా ప్రజలకు తెలుసని.. బండి సంజయ్ కొంగ జపానికి.. ప్రజలు మోసపోరన్నారు.

BJP నాయకుల తీరుకు ప్రజలంతా నవ్వుకుంటున్నారని.. సీఎం కేసీఆర్ ను చూసి కేంద్రంలో వణుకు పుట్టిందని తెలిపారు. ఆయనకు సమకాలిన నాయకుడు దేశంలోనే లేడని.. ఎదుర్కునే శక్తి లేక..బీజేపీ నేతలు అబద్ధాల ప్రచారంతో తిరుగుతున్నారని విమర్శించారు.

కేంద్రమంత్రి హోదాలో వచ్చిన అమిత్ షా తెలంగాణా కు ఎమిచ్చిండో.. ఇక్కడి బీజేపీ నాయకులకు ఇప్పుడైనా అర్ధమైందా..? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులను తెలంగాణకు తీసుకువచ్చి మరింత నవ్వుల పాలవుతున్నారు.. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారే తప్ప.. కొత్తగా వారికి ఓరిగేదేమి లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version