శ్రీశైలం ప్రమాదం వెనుక జగన్, కేసీఆర్: రేవంత్ రెడ్డి

-

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా!? అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసారు. జగన్ జల దోపిడీకి కేసీఆర్ సహకరించి… విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పామని ఆయన అన్నారు. జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోందన్నారు.

కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోననిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసారు. నిజా నిజాలు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ ప్రమాద ఘటనలో 9 మంది ఇంకా మంటల్లోనే ఉన్నారు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సిఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version