ఒక్క మిల్లీ మీటర్ ఎత్తు కూడా తగ్గదు..పోలవరం మీద జగన్ కీలక వ్యాఖ్యలు

-

ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం యిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ అజెండా ముగిశాక మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలకు పక్కా స్ట్రాటజీతో వెళ్లాలని మంత్రులకు  సీఎం సూచనలు చేశారు. శాసన మండలి సమావేశాల విషయంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేసారు.

పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో జరుగుతోన్న వివాదాలపై స్పందించిన సీఎం జగవ్ ఎత్తు తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని అన్నారు. ఒక్క మిల్లీ మీటర్ ఎత్తు కూడా తగ్గదని సీఎం జగన్ స్పష్టం చేశారు. నరేగా పనుల్లో మరింత వేగం పెంచాలని పలువురు మంత్రులు జగన్ కు సూచనలు చేశారు. ప్రణాళికబద్దంగా నరేగా పనులపై ఫోకస్ పెడదామన్న సీఎం జగన్ స్థానిక ఎన్నికల గురించి కూడా చర్చించినట్లు చెబుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version