డిల్లీ రిజల్ట్ : పట్టేలేనంత ఆనందం లో జగన్ మోహన్ రెడ్డి !!

-

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆప్ పార్టీ మరొకసారి అదిరిపోయే విజయాన్ని సాధించింది. వరుసగా మూడుసార్లు విజయం సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. కాగా ఈ ఎన్నికలలో బిజెపి పార్టీ గతంలో కంటే కొద్దిగా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. అయినా గాని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కే పట్టం కట్టారు.

దీంతో కేంద్రంలో బిజెపి పార్టీకి వరుసగా ఓటమి రావడంతో దేశవ్యాప్తంగా చాలా వివిధ పార్టీల నాయకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారని వారిలో ఎక్కువగా పట్టలేనంత ఆనందం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వ్యవహరించిన తీరు జగన్ కి చాలా బాధ కలిగించిందట.

 

ఇటువంటి నేపథ్యంలో న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మరియు ప్రత్యేక రైల్వే జోన్ విషయాలలో చాలా మొండిగా వ్యవహరించడంతో పాటు లోటు బడ్జెట్ కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విషయంలో కూడా అన్యాయంగా వ్యవహరించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ ఓడిపోవడంతో ఫుల్ హ్యాపీగా వైయస్ జగన్ ఉన్నట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో కచ్చితంగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కొద్దిగా తగ్గే అవకాశం ఉందని ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బిజెపి పతనం గ్యారెంటీ అని తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version