రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలా మారాడు – చంద్రబాబు

-

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదోని పోలీస్ కంట్రోల్ సర్కిల్ దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలా మారాడని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని నిలిపివేశాడని మండిపడ్డారు. ఈ మూడున్నర ఏళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని, రౌడీయిజం పెరిగిపోయిందని, దోపిడి, నేరాలు పెరిగిపోయాయి అన్నారు.

ఆదోనిలో ఇసుక దొరకడం లేదు కానీ.. హైదరాబాద్, బెంగళూరులో మాత్రం దొరుకుతుందని చెప్పారు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కు లారీల్లో డబ్బులు చేరుతున్నాయని ఆరోపించారు. ఒక పెళ్లి చేయాలంటే ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటాం, కానీ నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయామని పేర్కొన్నారు. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారని వెల్లడించారు. నేడు టిడిపి అధికారంలో ఉండి ఉంటే పింఛన్లు 3000 వచ్చేవని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version