దేశంలో అత్యంత ధనికుడిగా మారాలనేదే జగన్ లక్ష్యం – కన్నా లక్ష్మీనారాయణ

-

అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ వారి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ప్రస్తుత అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు అమరావతిని ఏపీ రాజధాని కావాలని కోరుకుంటున్నాయని తెలిపారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన జగన్.. ఆ తర్వాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ కు మూడు రాజధానులు కట్టాలని లేదని.. కేవలం దేశంలోనే అత్యంత ధనికుడు అయిన నాయకుడు కావాలనే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ కు ప్రజల గోడు పట్టదని, ఆయన ధ్యాసంతా ఆదాయం పైనే ఉంటుందని అన్నారు. వైసిపి నేతల భూకబ్జాలకు ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు. పేదలపై దోపిడీ తప్ప జగన్ కు అభిమానం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇసుక దొరక్క పోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version