సొంత పార్టీ వైపే జేడీ మొగ్గు..

-

ప్రత్యక్ష ప్రజాసేవలో పాల్గొనేందుకు తన పదవికి రాజీనామా చేసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన రాజకీయ పార్టీపై ఏర్పడిన సస్పెన్స్ కు తెరదించారు.  లక్ష్మీనారాయణ సోమవారం  హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  తన రాజకీయ రంగం ప్రవేశంపై వారితో చర్చించారు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ జేడీ ని తమ పార్టీపగ్గాలు చేపట్టాలని ఆహ్వానించడంతో కాస్త డైలమాలో పడ్డారు. దీంతో గత రెండు రోజులుగా ఏర్పడిన సస్పెన్స్ కి బుధవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కష్టమైన నష్టమైన తన రాజకీయ రంగ ప్రవేశం సొంత పార్టీ ద్వారానే జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version