కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందా మీకు..!

-

ఆ గుర్తుంది అయితే ఏంటి అంటారా? ఏం లేదు కానీ.. ఆమె కూడా ఓ ఇంటిది కాబోతున్నది. అందుకే ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకునేది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లే పెళ్లిళ్లు. మొన్ననే దీప్‌వీర్ పెళ్లి చూశాం. త్వరలో ప్రియాంకానిక్ పెళ్లి చూడబోతున్నాం. అదే డిసెంబర్‌లో ఎ..క్కడ అంటూ కొత్తబంగారు లోకంలో పలుకరించిన శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి కూడా ఉందట. అవును.. తను డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌తో ప్రేమలో పడింది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. గత జూన్‌లోనే వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్ 13న వీళ్లు పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారు. ఇటీవలే తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పింది శ్వేతా. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీళ్ల పెళ్లి పూణెలో జరుగుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version