Jr. NTR Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగ‌ర్ తార‌క్ షో: ఫ‌స్ట్ మెగా ప‌వ‌ర్ స్టార్.. లాస్ట్ సూప‌ర్ స్టార్..

-

Jr. NTR Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెర‌పై స్టార్ హీరోగా స‌త్తా చాటుకుంటూనే.. బుల్లి తెర మీద హోస్ట్ గా అలరిస్తున్నాడు. తనదైన మాటలతో బుల్లితెర ప్రేక్ష‌కుల టీవీ ముందు క‌ట్టిప‌డేస్తున్నాడు తారక్. ఇప్పటికే బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసిన బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ మరోసారి ఎవరు మీలో కోటీశ్వరులు షో ని హోస్ట్ చేస్తున్నాడు.

జెమిని టివిలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో కంటెస్టెంట్ల‌కు మ‌నీ ఇవ్వ‌డ‌మే కాకుండా మనసులను దోచుకున్నాడు తార‌క్. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సాగిన ఈ షో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీఆర్ఫీతో దూసుకుపోతుంది.

ఈ గేమ్ షో మొదటి ఎపిసోడ్‌‌‌లో గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ కొరటాల శివ, రాజమౌళి లు కూడా ఈ షోకు వ‌చ్చి సంద‌డి చేశారు. ఈ షోలో స‌మంత కూడా వ‌చ్చి సంద‌డి చేసింది. త‌న మ‌న‌స్సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టింది.

అయితే.. ఈ షో కు త్వ‌ర‌లోనే శుభం కార్డు పడేట‌ట్టు ఉంది. ఈ సీజ‌న్ కు చివ‌రి అథితిగా సూప‌ర్ స్టార్
మహేష్‌ బాబు రానున్నారని వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కాగా.. ఈ ఎపిసోడ్ ను ఎప్పుడూ టెలి కాస్ట్ చేయ‌నున్న‌ది తెలియ‌రాలేదు.

ఈ సీజ‌న్ చివ‌రిలో టెలికాస్ట్ షో చివ‌రిలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే.. మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్వ‌హ‌కులు భావిస్తున్నార‌ట‌. అయితే.. ఈ సీజన్ నవంబర్‌ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. అంటే ఈ లోపే ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version