స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తన మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాగా తాజాగా ఈ అంశంపై ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు టీడీపీ నేత టీడీ జనార్దన్ అసలు విషయాన్ని బయటపెట్టారు. జనార్దన్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల కోసం ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి వెళ్ళాము, కానీ అప్పట్లో బిజీ గా ఉన్నాను వారం తర్వాత రమ్మని చెప్పారని చెప్పారు. వారం తర్వాత వెళ్లి ఈ ఉత్సవాలకు ఎలాగైనా హాజరు కావాలని రిక్వెస్ట్ చేశామని చెప్పారు జనార్దన్.
జూనియర్ ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేసినా రావడం కుదరదన్నారు: టీడీపీ నేత జనార్దన్
-