పెళ్లయిన 3 రోజులకే బోర్డర్ నుంచి జవాన్‌కు కాల్.. నవవధువు కంటతడి!

-

పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు రావడంతో అతని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నవవధువు కంటతడి పెట్టుకుంది. మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు.. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది.

ఈ సందర్భంగా మనోజ్ భార్య యామిని మాట్లాడుతూ.. ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమైంది. పెళ్ళైన మూడు రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దీనికి సంబంధించి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news