కేటీఆర్.. నీ డ్రామా ఇంకెంతకాలం – కె.ఏ పాల్

-

మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. తన ఓటమిపై తాజాగా మరోసారి స్పందించారు కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను రద్దు చేయాలని తాను ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి వెళుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలలో పోలింగ్ అయిన రోజు ఈవీఎంలు రీప్లేస్ అయ్యాయనే విషయం ఆఫీసర్లందరికీ తెలుసని అన్నారు.

ఈవీఎంలు పెట్టకుండా బ్యాలెట్ పేపర్లు పెట్టాలని తాను ముందు నుంచి చెప్పుకొచ్చానని అన్నారు. ఎలక్షన్ అయిన మరుసటిరోజే కౌంటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ ఎందుకు కౌంటింగ్ చేయలేదని ప్రశ్నించారు. ” కేటీఆర్.. నీ డ్రామా ఇంకెంతకాలం, నీ మోసం ఇంకెంతకాలం, నీ కుతంత్రంం ఇంకెంతకాలం, నీకు సమయం దగ్గర పడింది. పైన దేవుడు తీర్పు, కింద ప్రజల తీర్పు, మూడవది మీడియా ద్వారా తీర్పు జరుగుతుంది” అన్నారు. కేటీఆర్ లాగా తాను భయపడే వాడిని కాదని.. అనిల్ రెడ్డితో కొట్టించినప్పటికీ.. నేను పారిపోయే వాడిని కాదన్నారు. దమ్ముంటే తనలా రోడ్డుపై తిరగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version