సద్గురు పై కంగనా ఎమోషనల్ పోస్ట్..!

-

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానమే ముఖ్యంగా సెలబ్రిటీలకి ఆయన మీద చాలా గౌరవం ఉంది. తాజాగా సద్గురు తలకి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. తరచు తలనొప్పి రావడం హాస్పిటల్లో చూపించుకోగా మెదడులో రక్తం గడ్డ కట్టడం వలన వైద్యులు ఆపరేషన్ చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఒక్కొక్కరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టులు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

తాజాగా బాలీవుడ్ నటి కంగానా ఎమోషనల్ ట్విట్ చేశారు నాకు ఈ విషయం తెలియగానే ఒక క్షణం స్పృహ కోల్పోయాను. సద్గురు ఐసీయూ బెడ్ పై పడుకోవడం చూస్తుంటే ఆయనకి కూడా మనలాగే ఎముకలు రక్తం మాంసాలు ఉన్నాయా అనిపించిందని ఎందుకంటే ఆయనను చూస్తే దేవుడు కుప్పకూలినట్లు అనిపించింది. నా కాళ్ళ కింద భూమి కదిరినట్టు ఆకాశం నన్ను విడిచి వెళ్లినట్లు అనిపించింది ఇది నేను నమ్మకూడదు అనుకున్నాను నాకు కన్నీళ్లు ఆగట్లేదు. నా బాధను మీ అందరితో పంచుకోవాలని ఉంది. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను ఆయన ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే సూర్యుడు ఉడాయించాడు భూమి కదలదు అని పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version