జగన్ ప్రవర్తన చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దోచుకున్నట్లుగా ఉంది : కన్నా లక్ష్మీనారాయణ

-

సీఎం జగన్ ప్రవర్తన చాక్లెట్ ఇచ్చి నక్లీస్ దోచుకున్నట్లుగా ఉందంటూ విమర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా
లక్ష్మీనారాయణ. మూడేళ్లలో ఏమి చేశావని గడపగడపకు ఎమ్మెల్యే లను వెళ్ళమంటున్నాడంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అక్కయ్య, చెల్లెలు, బావ, మామ అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు దోచుకుంటున్నాడని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపుల తెరలు కట్టుకొని పర్యటనలు చేస్తున్నాడని, కేంద్రం దాదాపు 130 సంక్షేమ పథకాలు ఇస్తుంటే జగన్ కేవలం 9 మాత్రమే అంటున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.

చేయడాన్ని అప్పులు దొరకడంలేదు.. వేయడానికి పన్నులు కనిపించడం లేదని ఆయన అన్నారు. అమ్మడానికి ప్రభుత్వ భూములు లేవని, ఇప్పటి వరకు ఆంద్రప్రదేశ్ కు రాజధాని లేదంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ పాలసీ.. రివర్స్ పాలనగా మారిందని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను పేరు మార్చి ప్రజలకు అందిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రావడం అనేది కలలోనేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version