చంద్రబాబు – జగన్ ల పై బీజేపీ బ్రహ్మాస్త్రం !

-

ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ముఖ్యమంత్రి జగన్ లపై తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గతంలో అనేక సార్లు యూటర్న్ తీసుకున్నారని సెటైర్లు వేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రతి విషయంలో రివర్స్ టర్న్ తీసుకుంటుందని జగన్ నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. విభజనతో నష్టపోయి అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి అసమర్థత మరియు అవినీతి పార్టీల వలన ప్రయోజనం ఏమీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీ బి జె పి ఏ అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్రంలో ఉన్న అన్ని పరిష్కారాలకు బీజేపీయే శరణ్య మంటూ కన్నా లక్ష్మీనారాయణ బ్రహ్మాస్త్రం లాంటి డైలాగులు వేశారు. మొత్తంమీద రాబోయే రోజుల్లో…బిజెపి పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేయగలదు అన్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version