కన్నడ హీరోయిన్లకు షాక్‌..డ్రగ్స్‌ తీసుకున్నట్లు రిపోర్ట్‌ !

-

కన్నడ డ్రగ్స్ కేస్ లో హీరోయిన్ లకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇరుకున్న కన్నడ హీరోయిన్లు రాగిణి, సoజన లు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ తేల్చేసింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్ ఎస్ ఎల్ కు బెంగుళూరు పోలీసులు పంపారు. అయితే… ఈ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లో డ్రగ్స్ సేవించినట్టు తేలింది.

మొదట బ్లడ్, యూరిన్ నమూనాలను యాక్టర్ నుండి సేకరించి ల్యాబ్ కు పంపిన పోలీసులు… వాటిలో ఫలితం సరిగ్గా తేలకపొడంతో వెంట్రుకల నమూనాలను సేకరించారు. ఇద్దరు కన్నడ హీరోయిన్లు రాగిణి, సoజన ల వెంట్రుకల నమూనాలను హైదరాబాద్‌ నగరం లోని ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు బెంగళూరు పోలీసులు. అయితే… వాటి లో డ్రగ్స్ సేవించినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ ఇద్దరు కన్నడ హీరోయిన్లు చిక్కుల్లో పడ్డారు. దీంతో మరోసారి ఇద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version