Karimnagar: కరీంనగర్‌ ఎంపీ బరిలో ఈటెల రాజేందర్‌?

-

భీమదేవరపల్లి : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధిష్టానం అవకాశం ఇస్తే కరీంనగర్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.మంగళవారం రోజున హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అక్కడ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించాడు. ఆ తర్వాత అక్కడ భక్తులకు వృక్ష ప్రసాదం పంపిణీ చేశారు.

 

మాజీమంత్రి ఈటల మాట్లాడుతూ.. తనకు కరీంనగర్ జిల్లా రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని తెలిపారు. నాకు అవకాశం వస్తే తప్పక కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. సర్కార్ కల్పించే సంక్షేమ పథకాల వల్ల ఎవరికి హాని కలుగవద్దని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రభుత్వం సహాయం చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version