చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సంచలన తీర్పు

-

స్కిల్ కేసు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులను వెలువరించింది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ట్ అనిరుద్ధ బోస్ అభిప్రాయపడగా ఇది చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు.

ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించడంతో ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లనుంది.ఈ కేసు విషయంలో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. దీనిపై ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అన్నారు.

chandrababu

ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద విచారణ చేయడం తగదన్నారు. అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదని తెలిపారు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పిటిషన్‌ను డిస్పోస్ చేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు.మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి. చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి దాన్ని వర్తింపజేయలేమని ఆయన పేర్కొన్నారు.

2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17ఏ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమని అన్నారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ తీసేసి, కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపచేయాలని అన్నారు. 2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ముందు ఉన్న సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు.

చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుందని పేర్కొన్నారు. ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయని అన్నారు. దీంతో చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్‌ పిటిషన్‌ను బదిలీ చేసింది.ఓవరాల్‌గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు అనుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version