‘కార్తీకేయ పార్ట్ 2’ వచ్చేస్తోంది..సినిమా విజయంపై నిఖిల్ ధీమా

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తీకేయ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఇందులో హీరోయిన్ గా ‘కలర్స్’ స్వాతి నటించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది.

చాలా కాలం కిందటే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనప్పటికీ కొవిడ్ వలన ఆలస్యమైంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ సైతం ఈ సినిమాపైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ థ్రిల్లర్ జోనర్ తనకు బాగా కలిసొచ్చందనే హీరో నిఖిల్ భావిస్తున్నాడట. ఇందులో స్వాతి, అనుపమా పరమేశ్వర్ హీరోయిన్స్ గా నటించగా, రావు రమేశ్ కీలక పాత్ర పోషించారు. జూలై 22న సినిమా విడుదల కానుంది. కాగా, అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. జూన్ 1న, ఉదయం 9 గంటలకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version