కెసిఆర్ తప్పు చేశారు కాబట్టే గుడికి రాలేదు – బండి సంజయ్

-

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. గుండంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయానికి చేరుకున్నారు. యాదాద్రి స్వామివారి సన్నిధిలో బండి సంజయ్ తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ తమది కాదని ఆయన స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తప్పు చేశారు కాబట్టే గుళ్లోకి రాలేదని ఆరోపించారు.

తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయ చరిత్ర సమాధి కాబోతోందని అన్నారు. ఈ కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం, వారికి మద్దతు తెలిపిన వారంతా దొంగలని ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఈ కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. ప్లాన్ ఫెయిల్ కవడంతోనే ప్రెస్ మీట్ అంటూ డ్రామాలు చేశారని అన్నారుు.

Read more RELATED
Recommended to you

Exit mobile version