లోక్ సభ ఎన్నికల ఖర్చుల నిమిత్తం.. 95 లక్షల రూపాయల చెక్కులు అందించిన కేసీఆర్..!

-

లోక్ సభ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులకు 95 లక్షల రూపాయల చెక్కులును అందించారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలకు సంబంధించి సమగ్ర చర్చ జరుగుతోంది.

ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ ఎంపీలు, పార్టీ శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం ని తీసుకున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news