డ‌య‌ల్‌100.. ప్రైవేటు స్కూళ్ల‌లో ఫీజులు పెంచొద్దు సీఎం కేసీఆర్ హెచ్చరిక

-

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు పాఠ‌శాల‌లు ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుతున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపిన ముఖ్య‌మంత్రి , దీన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించ‌బోమ‌న్నారు. 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి ఎటువంటి ఫీజు పెంపులు ఉండ‌కూడ‌ద‌ని అత్యంత క‌ఠినంగా ఆదేశాలు జారీ చేస్తున్న‌ట్లు సీఎం స్ప‌ష్టం చేసారు.

స్కూళ్లు సంవ‌త్ప‌రం మొత్తానికి ఒకేసారి ఫీజు వ‌సూలు చేయ‌డం, వివిధ ర‌కాల ఫీజులు చెల్లించ‌మ‌న‌డం లాంటి ప‌ద్ధ‌తులు అవ‌లంబిస్తే, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. నెల‌నెలా మాత్ర‌మే ఫీజు చెల్లించాల‌ని, అదీ కేవ‌లం ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే క‌ట్టాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ముఖ్య‌మంత్రి హిత‌వు ప‌లికారు. ఏ పాఠ‌శాల అయినా, ఈ విష‌యాల‌పై విద్యార్థుల‌ను వేధించిన‌ట్ల‌యితే డ‌య‌ల్‌100కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version