పాత బస్తీ వాసులకు కేసీఆర్‌ శుభవార్త..త్వరలోనే మెట్రో రైలు

-

పాత బస్తీ వాసులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. త్వరలోనే పాతబస్తీకి మెట్రో రైలు రానుంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 2,90,396 కోట్లతో ఆయన శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.1500 కోట్లు, పాత బస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయింపులు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం మెట్రోకు మరో రూ. 500 కోట్లు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version