నేడు ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ కీలక భేటీ

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలతో  భేటీ కానున్నారు. గురువారం నిర్వహించనున్న క్యాబినేట్ సమావేశానికి ముందు రోజు ఉద్యోగ సంఘాలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను నెలకొల్పుతుంది. క్యాబినేట్ భేటీకి మంత్రులందరు అందుబాటులో ఉండాలని ఇప్పటికే కేసీఆర్ వారిని ఆదేశించారు. నేడు జరగనున్న ఉద్యోగ సంఘాల భేటీలో కీలకమైన పీఆర్సీ, ఇతర  అంశాలపై చర్చించి ముఖ్య ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు భారీగా 35 శాతం ఫిట్ మెంట్ తో కూడిన కొత్త వేతన సవరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version