ఉపాధ్యాయులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త.. 9 వేల 266 మందికి ప్రమోషన్స్

-

ఉపాధ్యాయులకు కేసీఆర్‌ సర్కార్‌ సంక్రాంతి కానుక ఇచ్చింది. బదిలీలు, పదోన్నతులపై ప్రకటన కేసీఆర్‌ సర్కార్‌ కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేసింది. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి సమావేశం అయ్యారు.

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఈ సందర్భంగా చర్చ నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు. 9 వేల 266 మందికి ప్రమోషన్స్  ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు మంత్రులు. ఇక కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version