ఎట్టకేలకు సచివాలయానికి కేసీఆర్

-

పాత సచివాలయం ఉన్నప్పుడు అటు వంక చూడనే చూడని కేసీఆర్ ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు.

ప్రధాన గేట్ తో పాటు,ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్నిఆయా ప్రాంతాల డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఇక రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విష‌యం తెలిసిందే. 617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version