చూపులతో మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి చిత్రంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మహానటి సినిమా క్రేజ్ వల్లే ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించే అవకాశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. చివరిగా సర్కారు వారి పాట చిత్రంలో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మహానటి సినిమాతో తన అందం, కళ్ళతోనే ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు అదే కళ్ళతో మత్తుగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రకారులను సైతం కవ్విస్తోంది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో రెడ్ కలర్ దుస్తులలో కీర్తి సురేష్ సరికొత్తగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇక సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే కచ్చితంగా హిట్స్ రావాల్సిందేని చెప్పవచ్చు. అయితే కీర్తి సురేష్ గతంలో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉండేది.

ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ కు తగ్గట్టుగా మారిపోయి గ్లామర్ డోస్ ని కూడా పెంచేసిందని చెప్పవచ్చు. అలా సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ హాట్ అందాలను కుర్రకారులను సైతం మంత్రముగ్ధులను చేశాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో కూడా పలు రకాల ఫోటోషూట్లతో కీర్తి సురేష్ తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ప్రేక్షకులను. ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాలో డీ గ్లామరస్ గా నటిస్తోంది. ఆ తర్వాత చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version