వైరల్ గా మారిన కియారా – సిద్దార్థ్ పెళ్లి ఫోటోలు..!

-

ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ , సిద్దార్థ్ మల్హోత్రా మంగళవారం మూడుముళ్లతో ఒక్కటి అయ్యారు. రాజస్థాన్లోని జై సల్మేర్ సూర్య ఘర్ ప్యాలెస్ లో బంధుమిత్రుల సమక్షంలో ఈ స్టార్ జోడీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ స్టార్ జోడి వివాహం ఎప్పుడు చేసుకుంటారని అందరూ ప్రశ్నలు వేస్తుండగా ఆ ప్రశ్నలకు పులిస్టాప్ పెడుతూ తమ వివాహాన్ని పూర్తి చేసుకున్నారు తాజాగా పెళ్లికి హాజరైన అతిధులకు ఫోటోలు తీయకూడదన్న కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వీరి పెళ్లికి సంబంధించిన ఏ ఫోటో కూడా బయటకు రాలేదు.

దీంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. కానీ తాజాగా తమ పెళ్లి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసింది కియారా. హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి ఘనంగా జరిగినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా వీరి వివాహ వేడుకల ఫోటోలతో పాటు ఒకరికొకరు ముద్దు పెట్టుకునే ఫోటోలను కూడా షేర్ చేశారు.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. ” ఇప్పుడు మా బంధం పర్మినెంట్ గా బుకింగ్ అయింది ..మీ ఆశీర్వాదాలు కావాలి” అంటూ ఒక కామెంట్ కూడా పోస్ట్ చేశాడు.

ఇకపోతే వీరిద్దరి మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని క్షణాల వ్యవధిలోనే 15 లక్షలకు పైగా లైకులు అంతకుమించి వ్యూస్ లభించాయి. మొత్తానికి ఈ జంట చాలా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version