అరుదైన వ్యాధితో బాధ పడుతున్న కియారా.. ఎమోషనల్ అవుతూ..!!

-

బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది కియారా అద్వానీ. ఇక తెలుగులో భరత్ అనే నేను , వినయ విధేయ రామ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మళ్లీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే బాలీవుడ్ లో కూడా ఈమె తాజాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కియారా అద్వాని బాలీవుడ్ లో ఆనీష్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం భూల్ భూలయ్య 2.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆనందంలో మునిగి తేలుతోంది కియారా అద్వానీ. ఇక ఈ సినిమాకి ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె తనకు అతి వింత వ్యాధి గురించి మీడియాతో చెప్పుకొని ఎమోషనల్ అయ్యింది.ఇక ఈ క్రమంలోనే కియారా అద్వానీ ప్రముఖ ఫేమస్ షో కపిల్ శర్మ షో లో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగానే తనకు ఉన్న వింత వ్యాధి గురించి వెల్లడించింది కియారా అద్వానీ.

ఇక ఈ షోలో భాగంగా కపిల్ శర్మ కియారా అద్వానీ గురించి అడగగా ఆమెకి బర్డ్ ఫోబియా ఉంది అని స్పష్టం చేసింది. తనకు పెద్ద పెద్ద పక్షులు అంటే భయం అని.. వాటిని చూసినప్పుడు తన లో టెన్షన్ మొదలవడంతో పాటు కన్నీరు కూడా వస్తుంది అని.. ఇలా ఎందుకు వస్తుందో తెలియదు అంటూ ఆమె కొంచెం వరకు ఎమోషనల్ అయ్యింది. అయితే ఇప్పటికీ ఆ సమస్యకు చికిత్స లేకపోవడం చాలా బాధాకరం అంటూ కియారా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version