వైఎస్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం 2 ముక్కలై సర్వనాశనం అయ్యింది – కొడాలి నాని

-

రాష్ట్ర విభజన పై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు లాంటి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందన్నారు కొడాలి నాని. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందని 420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు విష ప్రచారం చేస్తున్నారని మంది పడ్డారు.

గుడివాడ ఎమ్మెల్యేగానే నేను ఉండటానికి ఇష్టపడతాను. మంత్రి పదవి పోతే బాధపడను. నేనేమీ చంద్రబాబు లాంటి వ్యక్తిని కాను. చంద్రబాబు లాంటి వారే పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని నిప్పులు చెరిగారు కొడాలి నాని. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంట ఒక సైనికుడిగా పనిచేయడమే నాకు ఇష్టం అన్నారు కొడాలి నాని.  కాపులు అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే వారిని‌ పట్టుకోవటానికి చంద్రబాబు వదిలిన గాలమే పవన్ కళ్యాణ్ అని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version