పురందేశ్వరిపై కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

-

ఏపీలో వైసీపీ నేతలకు విపక్షాలకు మధ్య విమర్శల పర్వ కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా.. గుడివాడకు కేంద్రం ప‌లు ఫ్లై ఓవ‌ర్ల‌ను ప్ర‌క‌టించింద‌ని, అయితే వాటిని బీజేపీ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి అడ్డుకుంటున్నారంటూ వైసీపీ కీల‌క నేత, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.

బీజేపీలో పురందేశ్వ‌రి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్నార‌ని, అదే హోదాతో ఆమె గుడివాడ‌కు మంజూరైన ఫ్లై ఓవ‌ర్ల‌ను అడ్డుకుంటున్నార‌ని నాని ఆరోపించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్ర‌స్తావించిన నాని… పురందేశ్వ‌రికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇప్ప‌టికైనా గుడివాడ అభివృద్ది ప‌నుల‌ను అడ్డు‌కునే య‌త్నాల‌ను విర‌మించాల‌ని ఆయ‌న పురందేశ్వ‌రికి సూచించారు. లేనిప‌క్షంలో పురందేశ్వ‌రి తీవ్ర ప‌రిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు కొడాలి నాని.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version