వీళ్లకసలు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నాయా : కొడాలి నాని

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వార్‌ ఇంకా ఏపీలో కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టుకు పంపామని, అందులో ఉన్నది మాధవ్ అని తేలిందని టీడీపీ నేతలు చెబుతుండడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు. ఎంపీ మాధవ్ వీడియోను అమెరికా ల్యాబ్ కు పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారని వెల్లడించారు. అది ఒరిజినల్ అని ఆ ల్యాబ్ వారు చెప్పినట్టు టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారని తెలిపారు. వీళ్లకసలు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నాయా అన్నది ప్రజలు గమనించాలని అన్నారు కొడాలి నాని.

ఫేక్ వీడియోను తయారుచేసిన ఫోర్ ట్వంటీ చంద్రబాబుకు ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు తేవడం కొత్తకాదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా మాట్లాడిన మాటలను అమెరికా ల్యాబ్ కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు కొడాలి నాని. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అని మాట్లాడిన చంద్రబాబు మాటలు ఆయన మాటలో కాదో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ అని అభివర్ణించారు కొడాలి నాని. దాన్ని టీడీపీ అని కాకుండా టీఎల్పీ (తెలుగు లింగ పరిశోధన పార్టీ) అని చెప్పాలని, దానికి చంద్రబాబు అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version