నేను బతికున్నంత వరకు గుడివాడలో వైసీపీ జెండా ఎగురుతుంది – కొడాలి నాని

-

తాను బతికున్నంత వరకు గుడివాడలో వైసీపీ జెండాని ఎగురుతుంది అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ఆర్సిపి కృష్ణా జిల్లా యువజన విభాగ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. నిజంగా తనని ఓడించే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేష్ కి ఉంటే.. గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

సూర్యుడు పడమరన ఉదయించినా.. గుడివాడలో తానే గెలుస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు 175 నియోజకవర్గాలలో ఎక్కడైనా వైసీపీకి పోటీగా లోకేష్ యువగళం సభ పెట్టాలని సవాల్ విసిరారు. యువగళం సభ కంటే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సభకు పదిరెట్లు యువత రాకుంటే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. పప్పులో పనికొచ్చే ప్రోటీన్ ఉంటుందని, లోకేష్ పప్పు కాదు ఎందుకు పనికిరాని పిప్పి తో సమానం అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version