Kollywood : కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ వచ్చేసింది….

-

అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ తెలుగులో థియేటర్ల కొరత వల్ల విడుదల కావడం లేదు. సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా కి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రియాంకామోహన్, శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

తాజాగా కెప్టెన్ మిల్లర్ కు సంబంధించిన ట్రైలర్ ను ధనుష్ తో పాటు చిత్ర యూనిట్ కూడా తమ ఎక్స్ పేజీలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. 1930ల బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో హీరో ధనుష్ నటించాడు.ఈ సినిమా రన్ టైం 2 గంటల 37 నిమిషాలు ఉంది. ఈ సినిమాకి పార్ట్-2 కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో కెప్టెన్ మిల్లర్ సినిమాకి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news