లాస్య నందిత మృతి పట్ల కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

-

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గాంధీ హాస్పిటల్ లో లాస్య నందిత మృతదేహాన్ని మంత్రి సందర్శించారు ఆమె కుటుంబాన్ని ఓదార్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లాస్య నందిత కారు రైలింగ్ కి తగిలినట్టు ఏసిపి చెప్పారని అన్నారు ప్రమాద సమయంలో లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఏసీపీ రవీందర్ రెడ్డి తనకు చెప్పారని అన్నారు.

చిన్న వయసులోనే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని విచారించారు. అధికారలాంచనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని అన్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version