మేం రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా… ? టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

-

వరి ధాన్యం కొనుగోలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారి తీసింది. రాహుల్ గాంధీ చేసిన ట్విట్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ట్విట్ వార్ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, కవితలు రాహుల్ గాంధీ ట్విట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత చేసిన ట్విట్ కు ప్రతిగా…2021లో ఎఫ్సీఐతో బాయిల్డ్ రైస్ ఇవ్వమని ఒప్పందం చేసుకున్న సంగతి మరిచారా అంటూ… రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఇక తాజాగా సీన్ లోకి భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎంటర్ అయ్యారు. రైతు సమస్యలపై టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలకు రెడీ అని… టీఆర్ఎస్ ఎంపీలు  సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. రైతుల కోసం ఢిల్లీ వేదికగా ధర్నా, ఆందోళన చేపట్టడానికి ఎప్పుడూ రెడీ అంటూ  సవాల్ విసిరారు. ఈ సవాల్ కు టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version