టీడీపీ కార్యకర్తగా పవన్‌ కళ్యాణ్ పని చేస్తున్నారు – కొమ్మినేని శ్రీనివాసరావు

-

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ప్రముఖ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో పవన్‌ కల్యాణ్‌ చెప్పడం లేదు. ప్రభుత్వ స్కీములలో లోటుపాట్లు వివరించడం లేదు. ఎంత సేపు చంద్రబాబు బాటలోనే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అరాచకంగా ఉందని.. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే అధోగతి అని ఇలా వింత వ్యాఖ్యలు చేస్తున్నారని చురకలు అంటించారు. టీడీపీ కార్యకర్తగా పవన్‌ కళ్యాణ్ పని చేస్తున్నారన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు.

పవన్‌ కల్యాణ్‌ ప్రతి వారాంతంలో ఏపీలో పర్యటిస్తూ ఏదో ఒక పంచాయతీ పెడుతూ తానేదో సాధిస్తున్నట్లు సంతోషపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన అచ్చం టీడీపీ అధినాయకత్వం మాదిరే అసత్యాలు, అర్ధం పర్దం లేని వ్యాఖ్యలు చేస్తున్నానన్న స్పృహను కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మండపేట, భీమవరంలలో జరిపిన కార్యక్రమాలలో చేసిన ప్రసంగాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. వాటిని చూస్తే తమ పార్టీ భవిష్యత్తు ఏమి అవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుసుకోవడం కష్టం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version