కోనసీమ సంఘటనను ఊహించలేదు: హోం మంత్రి తానేటి వనిత

-

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది జనసేన కార్యకర్త కాదా..? అని ప్రశ్నించారు హోం మంత్రి తానేటి వనిత. ఆ తరువాత ప్రతిపక్షాలు మాట మార్చాయి అని ఆరోపించారు. టీడీపీ, జనసేన నాయకులు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది నిజం కాదా అని అన్నారు. నిరసనకారుల వెనుక కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సందర్భంతో ఈ ఘటనలకు పాల్పడ్డారని ఆమె అన్నారు. ఇప్పటి వరకు 72 మందిని గుర్తించామని…46 మందిని అదుపులోకి తీసుకున్నామని వనిత తెలిపారు. ఈ కుట్రకు బాధ్యులెరో గుర్తిస్తాం అని అన్నారు. కోనసీమ సంఘటనను ఊహించ లేదని ఆమె అన్నారు. పోలీసులు చాాలా సంయమనం పాటించారని.. ఓ వైపు రాళ్ల దాడులు జరుగుతున్నా… పరస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని అన్నారు. గతంలో రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటిపై దాడిని ఖండించకుండా, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version