కృష్ణా బోర్డు కొత్త ఛైర్మన్​గా శివ్‌ నందన్‌కుమార్‌

-

కృష్ణా బోర్డుకు కొత్త ఛైర్మన్‌గా శివ్‌ నందన్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్న ఆయనను పదోన్నతి ద్వారా బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. దిల్లీలోని కేంద్ర జలసంఘంలో సభ్యులుగా నవీన్‌కుమార్‌, ఎస్‌.కె.సిబాల్‌లను కొత్తగా నియమించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖ సంచాలకుడు చందన్‌ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు.

కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన ఎం.పి. సింగ్‌ను రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌లు హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో అభినందించారు. బోర్డు ఇంజినీర్లు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version