డీకే లు, పీకే లు BRS గెలుపును ఆపలేరు: కేటీఆర్

-

తెలంగాణ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో BRS కు ఓటమి భయం పట్టుకున్నట్లు ఉంది పరిస్థితి చూస్తుంటే, కాగా తాజాగా సిరిసిల్ల లో కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా సిరిసిల్లకు డెవెలప్ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల నాకు రాజకీయంగా జన్మను ఇచ్చింది.. బదులుగా ఎటువంటి లోటు లేకుండా చూసుకోవలసిన బాధ్యత నాదే అంటూ కేటీఆర్ సెంటిమెంటల్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ అభివృద్ధి ఇంకా పెరగాలంటే మరోసారి BRS కు విజయాన్ని ఇవ్వండి అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 11 సార్లు కాంగ్రెస్ కు అవకాశాలు ఇచ్చారు.. ఇంకా ఎందుకు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలి, వారి పాలన అంతా కష్టాలమయం అని మరిచిపోవద్దు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

మాకు వ్యతిరేకంగా డీకే లు పీకే లు ఎంతమంది వచ్చినా BRS గెలుపును దూరం చెయ్యలేరు అంటూ ధీమాను వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ చెబుతున్నట్లు ఈసారి విజయం అంత తేలిక ఏమీ కాదు, కాంగ్రెస్ నుండి చాలా భారీగా పోటీ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version