కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవంపై కేటీఆర్ బిగ్ అప్డేట్

-

నూతన సచివాలయం గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఓ బిగ్ అప్​డేట్ ఇచ్చారు. త్వరలోనే సచివాలయం ప్రారంభోత్సవం జరగనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్​లో మరో మూడు మెగా ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్​లో తెలంగాణ అమరవీరుల స్మారకం,  125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ త్వరలోనే వీటికి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేడ్కర్ పేరును పెట్టనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

“రాష్ట్ర నూతన సచివాలయం సిద్ధమవుతోంది. త్వరలోనే తెలంగాణ అమరవీరుల స్మారకం ఏర్పాటు చేస్తాం. 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహానికి శంకుస్థాపన చేస్తాం. ఈ మూడు మెగా ప్రాజెక్టులను సీఎం కేసీఆర్​ లాంఛనంగా ప్రారంభిస్తారు.” – కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

 

Read more RELATED
Recommended to you

Exit mobile version