కేటీఆర్ వరుస ట్వీట్లు.. బాబు చిట్టి అంటూ సీఎం రేవంత్‌కు సెటైరికల్ పంచులు!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాజా పోస్టులో సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు మరణించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.స‌ర్కారు ఈ లెక్క‌ల‌ను ఎందుకు దాస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా.. ‘బాబు చిట్టి, రాజీవ్ గాంధీ బొమ్మకు ఢిల్లీలో మార్కులు పడ్డాయిగా, ఇక గాంధీ హాస్పిటల్‌లో చనిపోతున్న పిల్లలు, ఆడబిడ్డల మీద దృష్టి పెట్టు’ అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు.

గాంధీ ఆస్పత్రిలో శిశువులు, బాలింత మరణాల విషయమై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ బుధవారం స్పందిస్తూ ప్రభుత్వ దవాఖానను నాశనం చేసే కుట్రలు ఇకనైన బంద్ చేస్తే బెటర్ అంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు. గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లి,ఇక్కడికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాట్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని తెలిపారు.కానీ,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరుగుతున్నాయంటూ కేటీఆర్ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోగ్యమంత్రి దామోదర సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news