యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన..

-

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ముఖ మండపం నందు శ్రీ స్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పార్చన పూర్తయ్యాక అర్చక పండితులు మంగళ హారతులు ఇవ్వగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకితులయ్యారు.

వేకువ జామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యాభిషేకం, అర్చనలు, మంగళ నీరాజనం, అనంతరం నైవేధ్య సమర్పణ కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. లక్ష్మినరసింహుల నిత్య కళ్యాణోత్సవానికి స్వామి వారి ప్రియ భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యాదాద్రిపై కొలువుదీరిన శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకం,అర్చనలు నిర్వహించారు. కాగా, దేవస్థానం హుండీ ఆదాయ లెక్కింపును మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news